సహస్ర కిరణుడు ఉదయాద్రి నధిరోహించి, తన స్వర్ణ కాంతులతో ప్రకృతిని మెరిపించి పులికింపచేస్తూ, ఒక్కొక్క బారగా అనంతకాశంలోకి అధిరోహిస్తున్నాడు .
బాలభాను నిర్గత కాంతికిరణ యమును తరంగిణి పై ప్రసరించి, కెంజాయ కెరటాల ప్రతిఫలిస్తోంది.
సర్వకాల సర్వస్థలలోను కళకళలాడే ఢిల్లీ నగరం ఆనాడు కళకళ లాడుతూనే ఉంది ఉదయ భాస్కరుని లైయoడ కాంతులలో.
కానీ, నగరవాసులలో సంతోషం కన్నా విషాదం అధికం ఉందేమో అనిపిస్తుంది. దానికి కారణం లేకపోలేదు. అనేక సంవత్సరాలుగా తమను కన్నా తండ్రి వాలే పరిపాలించి తమను సకల శోభాగ్యాలతో ఓలలాడించించి మహారాజు ఆనం గోపాలుడు ఈనాడు రాజ్య త్యాగం చేయబోతున్నాడు.
-ప్రసాద్.